సింగపూర్‌కు చలో చలో... రేపు విజయవాడ నుంచి తొలి విమాన సర్వీస్‌

  • రాష్ట్ర చరిత్రలో తొలిసారి నేరుగా సర్వీస్‌లు
  • సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరనున్న విమానం
  • ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రాష్ట్ర విమానయాన చరిత్రలో మరో గుర్తుంచుకోదగ్గ ఘటన నమోదు కానుంది. మంగళవారం విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు విమాన సర్వీస్‌ ప్రారంభం అవుతోంది. సాయంత్రం 6.45 గంటకు సింగపూర్‌ వెళ్లే ఇండిగో విమాన సర్వీస్ ను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించనున్నారని కలెక్టర్‌ బి.క్ష్మీకాంతం తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారని, వీరి చేతుల మీదుగా బోర్డింగ్‌ పాసులను గౌరవ అతిథులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సింగపూర్‌కు విమాన సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల వివరాలు తెలియజేసేలా విమానాశ్రయంలో టూరిజం స్టాల్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.
Go Back to Shorts
Vijayawada
singpur flight

More Telugu News